Sustainable Development Goals!
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals – SDGs) అనేవి 2015లో న్యూయార్క్ లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015-30 కి యునైటెడ్ నేషన్స్ (United Nations) ద్వారా ప్రవేశపెట్టబడిన 17 లక్ష్యాలు ప్రపంచ దేశాలను సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధి వైపుకు దారితీసే విధంగా రూపొందించబడ్డాయి. వీటి ద్వారా పేదరికం, వైవిధ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనల్ని నివారించడమే కాకుండా, ఆర్థిక, సామాజిక, మరియు పర్యావరణ పరంగా సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా 2025 నాటికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGs) అమలు చేయడంలో కట్టుబడి ఉన్నాయి.
భారత్ విషయానికి వస్తే, 2025 నాటికి, దేశం SDG లక్ష్యాలను సాధించడంలో ప్రగతి సాధించింది. ప్రధానంగా, పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి నమోదైంది; సుమారు 400 మిలియన్ మంది పేదరికం నుండి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అదనంగా, MSME రంగానికి మద్దతు పెంచుతూ, మహిళలు మరియు పీవీటీలకు ప్రత్యేక రుణాలు మరియు మద్దతు కార్యక్రమాలను ప్రకటించారు.
Join Our Telegram Channel For More Job Updates
17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు:
1. పేదరికం నిర్మూలన :
2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గిoచాలి. దీని కోసం సంక్షేమ పథకాలను పేదవారికి చేరవేయాలి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ఆదాయం, సుఖంగా జీవించడానికి అవసరమైన వనరులను అందించాలి. ఆర్టిక వనరుల పై అందరికి సమాన హక్కులు ఉండాలి.
2. ఆకలిని నిర్మూలించడం :
ఆకలి, పోషకాహార లోపం, పోషకాహార సమస్యలు తగ్గించడం మరియు పోష్టిక ఆహారాన్ని అందించడం ద్వారా ఆకలిని నిర్మూలించగలము.
3. పోషకాహారం మరియు మంచి అర్యోగం :
ఆరోగ్య సేవలు అందించడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి నెలకొల్పడం తో పాటు ప్రజా అర్యోగానికి సంబందించి దోహా డిక్లరేషన్ లోని TRIPS ఒప్పదం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ రేటు తో నాణ్యమైన మందులు,టీకాలు అందించాలి.
4.నాణ్యమైన విద్య :
ప్రతి వ్యక్తికి మౌలిక విద్య అందించడం, ప్రతి ఒక్కరూ సమానంగా చదవడం కోసం 2030 నాటికి బాలబాలికులకు ప్రాథమిక విద్యనూ ఉచితంగా అంది౦చాలి.
5. లింగ సమానత్వం :
పురుషులు మరియు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా లింగ ఆధారిత వివక్షతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
6. నీటి వనరుల పరిరక్షణ :
2030 నాటికి ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందించడం ఆరోగ్య సమాజాన్ని నిర్మించగలము. మాలమూత్ర విసర్జనను అరికట్టాలి.

7. సుస్థిర విద్యుత్తు :
2030 నాటికి పునరుత్పత్తి వనరుల వాడకాన్ని పెంచడం ద్వారా కాలుష్య నివారణ తో పాటు నాన్-రెన్యూబుల్ రిసోర్సెస్ తగిoచగలము. సుస్థిర విద్యుత్తు సరఫరా సాధించడనికి పునరుత్పత్తి వనరుల Solar Energy,Wind Energy,Hydropower,Geothermal Energy వాడాలి.
CSIR NGRI Hyderabad Recruitment 2025
8. ఆర్థిక వృద్ధి మరియు సరైన ఉపాధి :
2030 నాటికి అందరికి ఉత్పాదక పనిని అందిచడం ద్వారా కార్మిక హక్కులు పరిరక్షించగలము. మరియు వలస కార్మికులకు సురక్షితమైన వాతావరణాన్ని అందిచడం దేశాల ఆర్థిక వృద్ధి సాదించగలము.
9. ప్రవృత్తి, పరిశోధన, మరియు బంధింపుల ఆధారంగా అభివృద్ధి :
మానవ సంక్షేమం,ఆర్థిక అభివృద్ధిక పెంపుదిoచేదుకు నాణ్యమైన,సురక్షితమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు, ఇన్నోవేషన్ మరియు మౌలిక వ్యవస్థలు అభివృద్ధి చేయడం ద్వారా 2030 నాటికి ఆల్ఫా అభివృద్ధి గల దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టిoపు చేయగలము.
10. సమానత్వం :
2030 నాటికి జనాభాలో అట్టడుగన ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ది రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాల వారికి సమాన అవకాశాలను అందించడం ద్వారా సాద్యం అగును.
11. పర్యావరణ రక్షణ :
2030 నాటికి అందరికి సురక్షితమైన ఇండ్లును నిర్మించాలి. ప్రజా రవాణాను పెంచాలి. విపత్తుల ద్వారా సంబవించే ప్రాణ,ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి. పట్టణాల్లో కాలుష్యం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర నగరాల అభివృద్ధి సాద్యం అగును.
12. జవాబుదారీతనం :
ఉత్పత్తి, సరపరా స్టాయిలో ఆహార వృధాను తగ్గించలి. 2030 నాటికి 3 R’s Reduce,Reuse,Recycle ద్వారా మనం ప్రకృతి వనరులపై ఒత్తిడి తగ్గించి, పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించవచ్చు. పర్యావరణానికి హానికరమైన ఉత్పత్తులను తగ్గించాలి.
13. పర్యావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు :
సహజ విపత్తులు కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా తీవ్రతను అంచనా వేయడం, ప్రజలను సురక్షితంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఉదాహరణ: Remote Sensing & Satellite Technology తో సాటిలైట్ చిత్రాలు వాతావరణ శాస్త్రం ద్వారా పొందిన డేటా ఉపయోగించి, వాతావరణ మార్పులు మరియు విపత్తుల ప్రభావాలు అంచనా వేయగలము.

14. సముద్ర వనరుల పరిరక్షణ :
అన్ని రకాల సముద్ర కాలుష్యలను మరియు అమ్లికరణ తగ్గించడం ద్వారా వనరులను పరిరక్షించడంతో పాటు, పర్యావరణాన్ని కూడా కాపాడగలము.

15. భూమి వనరుల పరిరక్షణ ;
అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భూమి, అడవులు, జంతువులు, పశువుల పరిరక్షణ,చిత్త నేలల పరిరక్షణ సంరక్షించాలి. కరవులు, వరదల వల్ల క్షినతకు గురయ్యే మృత్తికను పునరుద్దoచాలి.

16. శాంతి, న్యాయం మరియు స్థిరమైన సంస్థలు :
సమాజంలో శాంతి, న్యాయం మరియు సమగ్ర సంస్థలను కల్పించడం మరియు గ్లోబల్ గవర్నెన్స్ కు సంబందించిన సంస్థ లో అభివృద్ధి చెందుతున్న దేశాల బాగస్వామ్యన్ని బలోపేతం చేయాలి.

17. ప్రపంచ భాగస్వామ్యం మరియు లక్ష్యాల అమలు :
అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు పర్యావరణ అనుకూల సాంకేతికతను అందించాలి. గ్లోబల్ భాగస్వామ్యంతో SDGs సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాదించగలము.
SDG లక్ష్యాలలో భారతదేశం పాత్ర:
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGs) సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2015లో యునైటెడ్ నేషన్స్ ప్రారంభించిన ఈ లక్ష్యాలు 2030 నాటికి ప్రపంచాన్ని సామాజిక, ఆర్థిక, మరియు పర్యావరణ పరిరక్షణ దిశగా ముందుకు నడిపించడానికి రూపొందించబడ్డాయి. భారతదేశం ఈ లక్ష్యాలను అమలు చేయడంలో విశేషమైన కృషి చేస్తున్నది.
భారత్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG) ప్రగతి గురించి తాజా సమాచారం ప్రకారం, NITI ఆయోగ్ విడుదల చేసిన SDG ఇండియా ఇండెక్స్ 2023-24 ప్రకారం, భారత్ యొక్క మొత్తం స్కోరు 71కి పెరుగుదలను చూపుతుంది, ఇది 2020-21లో 66గా ఉంది. రాష్ట్రాల ప్రదర్శనను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ మరియు కేరళ ప్రతి ఒక్కరూ 79 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. తమిళనాడు 78 స్కోరుతో మూడవ స్థానంలో ఉంది, తర్వాత గోవా 77 స్కోరుతో ఉంది. ఇతర రాష్ట్రాలలో, బిహార్ 57 స్కోరుతో దిగువ స్థానం పొందింది, తర్వాత జార్ఖండ్ 62 మరియు నాగాలాండ్ 63 స్కోరులతో ఉన్నాయి.
-
పేదరిక నిర్మూలన:
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఒకటిగా, పేదరికం నిర్మూలనకు పెద్దగా దృష్టి సారించింది. పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, నాణ్యమైన ఆహారం అందించడం, మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. -
ఆరోగ్యమే మహాభాగ్యమ:
భారతదేశం ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభించబడ్డాయి. అలాగే, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. -
స్వచ్ఛ భారత్ మిషన్:
స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా, భారతదేశం ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని రక్షించడంలో మరియు మలినాలు తొలగించడం కోసం పెద్దగా కృషి చేస్తోంది. ఇది “స్వచ్ఛత” లక్ష్యానికి సంబంధించిన భాగంగా భారత్ చేసిన ఒక గొప్ప ప్రయత్నం. దీనికి గాంధీజీ ని ఆదర్శంగా తీసుకోవడం జరగింది. -
పర్యావరణ పరిరక్షణ:
భారతదేశం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడానికి “ప్రముఖ సౌర విద్యుత్ ప్రాజెక్టులు” (సమాధాన విద్యుత్ రంగం అభివృద్ధి) వంటి పెద్ద స్థాయిలో మార్గదర్శక చర్యలు చేపడుతుంది. దాదాపు 40% విద్యుత్తు ఉత్పత్తి క్రమంలో పునర్వినియోగ వినియోగాలను ఉపయోగించేందుకు కృషి చేస్తున్నది. ఉదా: ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) అనేది సౌర శక్తి యొక్క వినియోగం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచదేశాలు కలిసిన ఒక అంతర్జాతీయ సంఘటన. 2015 లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్వా హోలాండ్ సంయుక్తంగా ఈ అలయన్స్ను ప్రారంభించారు. ఈ అలయన్స్లో ప్రధానంగా సౌర శక్తిని వినియోగించడానికి మరియు పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సరైన మార్గాలను అన్వేషించడమే లక్ష్యం. సౌర శక్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించి, గ్లోబల్ ఉష్ణోగ్రత, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి కృషి చేయడం జరగుతుంది. -
మహిళల సాధికారికరణ:
భారతదేశం మహిళల సాధికారికరణ కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించింది, ఇందులో మహిళలకు ఉచిత ఆహారం, విద్య, మరియు ఆరోగ్య సేవలు అందించడం, ఇంకా మహిళల వ్యాపార మరియు ఆర్థిక స్వావలంబన కోసం చిన్న మొత్తంలో రుణాలు మరియు శిక్షణలు అందించడం కూడా ఉన్నాయి. ఉదా: Beti Bachao, Beti Padhao, Pradhan Mantri Ujjwala Yojana,Pradhan Mantri Awas Yojana,Jan Dhan Yojana, Self Help Groups – SHGs మరియు Skill Development and Entrepreneurship Program -
ఆధునిక శాస్త్రం మరియు సాంకేతికత అభివృద్ధి: